'అడవిలోనే ఉంటాం.. అడవినొదిలి పోతాం'.. ఒకే చోట రెండు వాదనలు

వీడియో క్యాప్షన్, నల్లమల టైగర్ రిజర్వ్
'అడవిలోనే ఉంటాం.. అడవినొదిలి పోతాం'.. ఒకే చోట రెండు వాదనలు
ప్రచురణ

నల్లమలలో జనావాసాలు ఉన్న గూడేలు, పెంటలను తరలించాలని 2002లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు అటవీశాఖ చెబుతోంది.

పులుల సంరక్షణ చర్యల్లో భాగంగా జనావాసాల తరలింపు కార్యక్రమాలను 1973లో తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ, ఏళ్ల తరబడిగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాలను తరలించాలని అటవీ శాఖ నిర్ణయించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)