BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?
పేపర్ లీకేజీలు, వ్యవస్థీకృత మాఫియా కాపీయింగ్ను అడ్డుకోవడం ఈ చట్ట సవరణ లక్ష్యం. దీనితోపాటు పరీక్షలు నిర్వహించే సంస్థల బాధ్యతను ఖరారు చేస్తూ ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఫేస్బుక్లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?
ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వార్తాసంస్థ ఏఎన్ఐతో చెప్పారు.
జపాన్లో 7.1 తీవ్రతతో భూకంపం, విధ్వంసాన్ని చూపే 9 ఫోటోలు...
భూ ప్రకంపనల అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దాదాపు గంట వ్యవధిలోనే వాటిని ఉపసంహరించుకున్నారు.
'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో వేదిక పంచుకుని, ‘షైనింగ్ స్టార్’ అవార్డు సాధిస్తానని మాట ఇచ్చిన రెండు రోజులకే పదో తరగతి విద్యార్థిని శివాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలంలో లభించిన లేఖ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?
‘‘ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా మంది ఉచితంగా చదువుకుంటున్నారు. ఈ యూనివర్శిటీ లేకపోతే అలీగఢ్కు వెళ్లాల్సి వచ్చేది. ఎన్నో ఇబ్బందులను పడాల్సివచ్చేది'' అని ఓ రైతు అన్నారు.
'మా నాన్న కల నెరవేర్చడానికి.. కార్ల మీదే సముద్రాన్ని దాటేశాం' అంటున్న యువకుల కథ
మరణశయ్యపై ఉన్న తండ్రి చివరి కల కోసం.. రెండు పాత కార్లనే పడవల్లా మార్చి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటేసిన ఇద్దరు యువకుల స్టోరీ ఇది. భయంకరమైన తుపానులు, షార్క్ చేపల దాడులను తట్టుకుంటూ 119 రోజుల పాటు వారు చేసిన ఈ అసాధారణ సముద్ర ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందంటే..
ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?
''అసెంబ్లీ, లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల వయసు 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలి. శాసనమండలి, రాజ్యసభకు పోటీచేసే వయసు 30 నుంచి 25కు తగ్గించాలి'' అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు
జులై 25న ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికుమార్ తన కుటుంబంతో కలిసి గిరి ప్రదక్షిణకు వెళ్లారు. రాత్రిపూట ఇడుక్కు పిళ్ళయార్ ఆలయానికి వచ్చిన మణికుమార్ గుహలాంటి ఇరుకైన మార్గంలోకి ప్రవేశించారు. ఆ గుహ నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. స్పృహ తప్పిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.
నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...
నరేంద్ర మోదీ మార్క్ రాజకీయాలకు జెన్ జెడ్ ఉద్యమం సవాలుగా మారిందా? నిరసనల సెగతో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి రావడం మోదీ రాజకీయ శైలికి భిన్నమైనదా? యువత ఆగ్రహం వెనుక కేవలం పేపర్ లీకేజీలే ఉన్నాయా లేక ఉపాధి లేకపోవడమే కారణమా? మోదీ ఇమేజ్కు తగిలిన ఈ ఎదురుదెబ్బపై ప్రత్యేక విశ్లేషణ..
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఫీచర్లు
తాజ్మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































